
మాదాపూర్, వెలుగు: ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువతి కేబుల్ బ్రిడ్జి పై నుంచి దుర్గం చెరువులోకి దూకేందుకు యత్నించింది. మాదాపూర్ట్రాఫిక్పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆమెను ప్రాణాలతో కాపాడారు.
పోలీసులు తెలిపిన ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం12.51 గంటల సమయంలో ఓ యువతి(25) దుర్గం చెరువు పైనున్న కేబుల్బ్రిడ్జి ఫుట్పాత్పై చేరుకుంది. బ్రిడ్జిపైకి ఎక్కి చెరువులోకి దూకి సూసైడ్ చేసుకునే ప్రయత్నించింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు చూసి వెంటనే ఆమెను కిందకు దించి కాపాడారు. అంతకుముందే ఆ యువతి గుర్తు తెలియని ట్యాబ్లెట్స్వేసుకోవడంతో చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.