ఇంటిపై నుంచి జారి పడిన మహిళ.. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి

ఇంటిపై నుంచి జారి పడిన మహిళ.. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి

హైదరాబాద్ ఆల్వాల్  బొల్లారం ప్రేమ్ నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. చంద్రకళ (58) అనే మహిళ ప్రమాదవశాత్తూ ఇంటి పై  నుండి జారీ కింద పడింది. హుటాహుటీన ఆమెను ఆల్వాల్లోని జీఎన్ఆర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకొచ్చినా కూడా రెండు గంటలు పాటు ఆమెకు చికిత్స అందించకపోవడంతో మృతి చెందింది. అటు   వైద్యుల నిర్లక్ష్యం వల్లే  చంద్రకళ  మృతి చెందిందని ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు  ఆందోళన చేశారు.

చంద్రకళ మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు..సంఘటన స్థలానికి చేరుకుని హాస్పటల్ మేనేజర్ ను అదుపులోకి తీసుకున్నారు.