బంగారం కొనడానికి వచ్చింది.. కమ్మలు మాయం చేసింది

బంగారం కొనడానికి వచ్చింది.. కమ్మలు మాయం చేసింది

సికింద్రాబాద్, వెలుగు: జువెలరీ షాప్​కి వచ్చిన ఓ మహిళ బంగారు కమ్మలు కొట్టేసిన ఘటన మోండా మార్కెట్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఏరియాలోని పాట్ మార్కెట్​లో సంజయ్ ఉపాధ్యాయ అనే వ్యక్తి స్వతంత్ర జువెలర్స్​ పేరుతో నగల షాప్​ను నడుపుతున్నాడు. ఈ నెల 7న సాయంత్రం జువెలరీ షాప్​కి వచ్చిన ఓ మహిళ చెవి కమ్మలు చూపించమని అడిగింది. కొన్నింటిని చూసి అవి నచ్చలేదని మరికొన్ని తేవాలని షాపులో పనిచేసే సిబ్బందికి చెప్పింది.

సిబ్బంది మరికొన్ని నగలు తెచ్చేలోగా సదరు మహిళ 11 గ్రాముల చెవి కమ్మలను కొట్టేసి తన బ్యాగ్​లో దాచింది. కొద్దిసేపటి తర్వాత ఏ నగలు నచ్చలేదని చెప్పి షాప్​లో నుంచి బయటికి వెళ్లిపోయింది. అయితే, చెవి కమ్మలు పోయినట్లు గుర్తించి షాప్ సిబ్బంది సీసీ ఫుటేజ్​ను పరిశీలించారు. మహిళ వాటిని కొట్టేసినట్లు గుర్తించి వెంటనే మోండా మార్కెట్ పీఎస్​లో కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.