వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

భర్త, అత్త వేధింపుల కారణంగా మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గోపన్ పల్లి తండాకు చెందిన కంకణాల సంతోష్ కు, స్రవంతి అనే యువతిలో 2017లో వివాహం జరిగింది. వారు ప్రస్తుతం గోపన్ పల్లి తండాలోని ముప్పా అపార్ట్ మెంట్స్ లో నివాసముంటున్నారు. సోమవారం రాత్రి స్రవంతికి భర్త సంతోష్, అత్తతో గొడవ జరిగింది. దాంతో మనస్థాపానికి గురైన స్రవంతి మంగళవారం తెల్లవారుజామును ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం స్రవంతి మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

For More News..

నాకు సీఎం పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. కానీ..

అంత్యక్రియలైన 5 రోజులకు కరోనా సోకినట్లు గుర్తింపు

బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేది.. హత్యా? ఆత్మహత్యా?