గాంధీ ఆస్పత్రిలో మహిళ మిస్సింగ్ .. కూతురిని డెలివరీకి తీసుకొచ్చి కనిపించకుండాపోయిన తల్లి

గాంధీ ఆస్పత్రిలో మహిళ మిస్సింగ్ .. కూతురిని డెలివరీకి తీసుకొచ్చి కనిపించకుండాపోయిన తల్లి

పద్మారావునగర్, వెలుగు: కూతురిని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చిన ఓ మహిళ కనిపించకుండాపోయింది. చిలకలగూడ ఎస్సై కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​కు చెందిన యనివందుల మహేశ్.. తన​భార్య కవితను డెలివరీ కోసం ఈ నెల 22న గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. వారితో పాటు కవిత తల్లి రిషికెల లక్ష్మీబాయి (55) కూడా వచ్చింది.

అయితే, కవితకు చెకప్ మాత్రమే చేయించిన మహేశ్​ ఆమెను తీసుకుని ఈ నెల 29న తిరిగి నిజామాబాద్​కు బయలుదేరాడు. అదే టైమ్​లో కవిత తల్లి లక్ష్మీబాయి కనిపించలేదు. ఎక్కడా వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో మహేశ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.