పద్మారావునగర్, వెలుగు: కూతురిని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చిన ఓ మహిళ కనిపించకుండాపోయింది. చిలకలగూడ ఎస్సై కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెందిన యనివందుల మహేశ్.. తనభార్య కవితను డెలివరీ కోసం ఈ నెల 22న గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. వారితో పాటు కవిత తల్లి రిషికెల లక్ష్మీబాయి (55) కూడా వచ్చింది.
అయితే, కవితకు చెకప్ మాత్రమే చేయించిన మహేశ్ ఆమెను తీసుకుని ఈ నెల 29న తిరిగి నిజామాబాద్కు బయలుదేరాడు. అదే టైమ్లో కవిత తల్లి లక్ష్మీబాయి కనిపించలేదు. ఎక్కడా వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో మహేశ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.