చనిపోయిందనుకుంటే.. పదేండ్లకు తిరిగొచ్చింది

చనిపోయిందనుకుంటే.. పదేండ్లకు తిరిగొచ్చింది

బెల్లంపల్లి, వెలుగు: చనిపోయిందనుకున్న మహిళ తిరిగి రావడంతో కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని బోయవాడకు చెందిన టేకులపల్లి వెంకటి, -మధునక్కకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు రజిత పదేండ్ల క్రితం కనిపించకుండా పోయింది. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు చనిపోయిందని భావించారు. శనివారం రజిత కూతురితో సహా ఇంటికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలీ పని కోసం జమ్మికుంట వెళ్లానని, అక్కడ మహారాష్ట్ర నాందేడ్​ జిల్లా హనీగావుకు చెందిన రాజు పరిచయమయ్యాడని పేర్కొంది. అతనితో కలిసి వెళ్లి వాళ్ల ఊర్లో పెళ్లి చేసుకున్నానని తెలిపింది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే కొడతారని ఇక్కడికి రాలేదని చెప్పింది. రాఖీ పండగకు తమ్ముడు పవన్​గుర్తుకు వచ్చాడని, రాఖీ కట్టడానికి సొంత ఊరికి వచ్చానని పేర్కొంది. తనకు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారని చెప్పింది.