బంజారాహిల్స్ లో ‘జస్ట్ డయల్’లో కిలేడీలు...పనికి వస్తామని పైసలు కొట్టేసిన్రు

బంజారాహిల్స్ లో ‘జస్ట్ డయల్’లో కిలేడీలు...పనికి వస్తామని  పైసలు కొట్టేసిన్రు

జూబ్లీహిల్స్, వెలుగు: ఇంటి పని మనుషుల కోసం ఆన్​లైన్​లో వెతికిన ఓ సివిల్ ఇంజినీర్​ను ఇద్దరు మహిళలు మోసం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.13లోని శ్రీ సాయి నగర్​లో నివసించే బొల్లం కార్తీక్ (34) సివిల్ ఇంజినీర్. ఈ నెల 9న తన ఇంటి పనుల కోసం వంటమనిషి, సహాయకులు కావాల్సి రావడంతో ‘జస్ట్‌‌‌‌‌‌‌‌ డయల్’  వైబ్​సైట్​లో వెతికాడు. ఈ క్రమంలో అమృత, జయలక్ష్మి అనే మహిళలు ఆయనను సంప్రదించారు. 

పనికి వస్తామని నమ్మబలికిన సదరు మహిళలు.. అగ్రిమెంట్ చేసుకుందామని, ముందుగా అడ్వాన్స్ డబ్బులు చెల్లించాలని కోరారు. వారి మాటలు నమ్మిన కార్తీక్ గూగుల్ పే ద్వారా రూ.15,500 అడ్వాన్స్​గా పంపించారు. అయితే, మరుసటి రోజు పనికి రావాలని ఆయన వారికి ఫోన్ చేయగా.. నిందితులిద్దరూ కార్తీక్ నంబర్​ను బ్లాక్ చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.