స్త్రీనిధి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి: మంత్రి సీతక్కకు ఉద్యోగుల వినతి

స్త్రీనిధి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి: మంత్రి సీతక్కకు ఉద్యోగుల వినతి

హైదరాబాద్, వెలుగు: స్త్రీనిధి ఉద్యోగులకు పేస్కేల్ ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అసిస్టెంట్ మేనేజర్లకు ఉన్న రూ.8400 జీతాన్ని పెంచి కనీస వేతనంగా రూ.30 వేలు ఇవ్వాలని తెలిపారు. ఆదివారం సెక్రటేరియెట్ లో స్ర్తీనిధి ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ సింగ్, జ్యోతి, నాగపూర్ రామ్ మోడీలతో సహా పలువురు మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందచేశారు.

మూడేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి కెరీర్ అడ్వాన్స్ మెంట్ ద్వారా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పారు. అటెండెన్స్ యాప్ లో ఉన్న రూల్స్ ను సవరించాలని మంత్రిని కోరారు. తమ వినతులకు మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారని ఉద్యోగులు పేర్కొన్నారు.