
మహిళా సాధికారతే లక్ష్యంగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం శంకర్ పల్లి మండలం మోకిలలో చేనేత వస్త్రాలతో 3కే, 5కే, 10కే మారథాన్ నిర్వహించారు. దాదాపు 500 మందికి పైగా మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, చేనేత వస్త్రాల స్టాళ్లు ఆకట్టుకున్నాయి. రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ భవానీ రెడ్డి, మహిళా కమిషనర్ చైర్మన్ పద్మజ పాల్గొన్నారు.