
మహిళలు పురుషుల కంటే చురుకైన వారన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. చెన్నైలోని ‘స్టెల్లా మేరిస్’కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ హాజరై విద్యార్థినులతో చిట్చాట్ చేశారు. ఈసందర్భంగా రాహుల్ మాట్లాడుతు తాము అధికారంలోకి తర్వాత మొదటి పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లు ఆమోదిస్తామన్నారు. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామి ఇచ్చారు. దేశంలో మహిళలు ఎలాంటి వివక్షాపూరిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలకు వెలితే తెలుస్తుందన్నారు. అక్కడి పరిస్థితులను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేనన్నారు. అందుకే ఈ వివక్షతకు చికిత్స చేయాలన్నారు రాహుల్. పురుషులతో సమాన స్థాయిలో మహిళలు ఉండాలన్నారు. ప్రస్తుతం మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేదని….పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో చూశానని… మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేదన్నారు. అందుకే 2019లో మహిళా బిల్లు తీసుకురావాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అందుకే 2019లో మహిళా బిల్లు తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు రాహుల్ గాంధీ.