V6 News

రాణించిన మిథాలీ సేన.. సౌతాఫ్రికా టార్గెట్ 275

రాణించిన మిథాలీ సేన.. సౌతాఫ్రికా టార్గెట్ 275

సెమీస్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ భారత బ్యాటర్లు సత్తా చాటారు. వుమెన్స్ ప్రపంచకప్ లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లో ఇండియా..ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. దీంతో ప్రొటీస్ ముందు 275 భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు స్మృతి మందానా 71, షెఫాలీ వర్మ 54 పరుగులతో అర్థ శతకాలతో శుభారంభం చేయగా..తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు కెప్టెన్ మిథాలీ రాజ్ 68, హార్మన్ కౌర్ 48 పరుగులతో సత్తా చాటారు. సౌత్ ఆప్రికా బౌలర్లలో మసాబాటా క్లాస్, షబ్నిమ్ ఇస్మైల్ రెండేసీ వికెట్లు తీశారు. క్లో ట్రియన్,అయాబోంగా, ఖాకా చెరో వికెట్ తీశారు.