V6 News

అటాక్​ ‘కింగ్​’లు వచ్చేసినయ్

అటాక్​ ‘కింగ్​’లు వచ్చేసినయ్

అపాచీ హెలికాప్టర్లు.. ఆకాశంలో శత్రువును వెంటాడి వేటాడి అటాక్​ చేయగలవు. గన్నుల నిండా బుల్లెట్లు నింపుకుని దాడి చేసేయగలవు. రాకెట్లను విసరగలవు. అంతటి శక్తిమంతమైన అపాచీ హెలికాప్టర్లు ఆర్మీలోకి వచ్చేశాయ్​. నాలుగు అపాచీలు శనివారం భారత వాయు సేన వాకిట్లో వాలిపోయాయి. దీంతో ఇండియా దగ్గర ఉన్న తొలి అటాకింగ్​ హెలికాప్టర్​గా అపాచీ పేరు తెచ్చేసుకుంది.

ఘజియాబాద్​లోని హిందన్​ ఎయిర్​ఫోర్స్​ స్టేషన్​లో భద్రతా బలగాలు ఈ ఏహెచ్​–64ఈ వెర్షన్​ హెలికాప్టర్లను రిసీవ్​ చేసుకున్నాయి. మరో నాలుగు వచ్చే వారం వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత వాటన్నింటినీ పంజాబ్​లోని పఠాన్​కోట్​  ఎయిర్​ఫోర్స్​ స్టేషన్​కు పంపిస్తారు. సెప్టెంబర్​లో అధికారికంగా ఆర్మీలోకి వాటిని తీసుకుంటారు. 22 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలు కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం 2015లో అమెరికాతో ఒప్పందం చేసుకుంది. మిగతా హెలికాప్టర్లు 2020 నాటికి వచ్చే అవకాశం ఉంది.