డబ్ల్యుపీఎల్-2.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

డబ్ల్యుపీఎల్-2.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

మెన్స్ ఐపీఎల్ కు ముందు సందడి చేయడానికి విమెన్స్‌‌‌‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌ (డబ్ల్యూపీఎల్‌‌) సిద్ధమైంది. రెండో సీజన్‌‌ నేటి (ఫిబ్రవరి 23) నుంచి మొదలుకానుంది. తొలి పోరులో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ ముంబై ఇండియన్స్‌‌తో, రన్నరప్‌‌ ఢిల్లీ క్యాపిటల్స్‌‌ తలపడనుంది. గతేడాది ఫార్మాట్‌‌లోనే ఈ సారి కూడా మ్యాచ్‌‌లను నిర్వహించనున్నారు. ముంబై ఇండియన్స్ (MI) , ఢిల్లీ క్యాపిటల్స్ (DC) , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ జెయింట్స్ (GG), UP వారియర్జ్ (UPW) ఈ ట్రోఫీ కోసం తలపడతాయి.   

దాదాపుగా అన్ని జట్లలో స్వదేశీ, విదేశీ స్టార్‌‌ ప్లేయర్లు ఉండటంతో మ్యాచ్‌‌లు రసవత్తరంగా సాగనున్నాయి. అయితే అన్ని టీమ్స్‌‌ కూడా యంగ్‌‌ ప్లేయర్లపై ఎక్కువగా ఫోకస్‌‌ చేయనున్నాయి. తొలి సీజన్‌‌లో కప్‌‌ కొట్టిన ముంబై మరోసారి అదే పెర్ఫామెన్స్‌‌ను రిపీట్‌‌ చేయాలని భావిస్తుండగా, బెంగళూరు, గుజరాత్‌‌, ఢిల్లీ, యూపీ కూడా తమ సత్తా చూపేందుకు రెడీ అయ్యాయి. ఫైనల్ మ్యాచ్ మార్చ్ 17 న ఢిల్లీ వేదికగా జరగుతుంది. మొత్తం 22 రోజుల పాటు అభిమానులకు వినోదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.  

లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

టీవీల్లో ఈ మ్యాచ్ స్పోర్ట్స్ 18 ఛానెల్ లో లైవ్ ప్రసారం చేయబడుతుంది. మొబైల్స్ లో జియో సినిమాలో ఈ మ్యాచ్ ను ఫ్రీగా చూడొచ్చు. ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ 2023 సీజన్ కూడా జియో సినిమా ఫ్రీగా ప్రసారం చేసింది. మ్యాచ్ లన్నీ సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రారంభమవుతాయి.