కల్తీ పాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

కల్తీ పాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న వలిగొండ పాండు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 150 లీటర్ల కల్తీ పాలు, 2 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా భూదాన్ పోచంపల్లి మండలం గౌస్ కొండ గ్రామంలో కల్తీ పాల వ్యాపారం చేస్తున్న అస్గర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అతని వద్ద నుంచి 200 లీటర్ల కల్తీ పాలు, 100. Mll హైడ్రోజన్ పెరాక్సైడ్, 3 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.