భూ సమస్యలే ఎక్కువ.. యాదాద్రి జిల్లా ప్రజావాణిలో ఫిర్యాదులు

భూ సమస్యలే ఎక్కువ.. యాదాద్రి జిల్లా ప్రజావాణిలో ఫిర్యాదులు

యాదాద్రి, వెలుగు:  యాదాద్రి జిల్లాలో నిర్వహించిన ప్రజావాణిలో భూ సమస్యలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. మొత్తంగా 51 ఫిర్యాదులు రాగా, అందులో 32 భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. మిగిలిన వాటిలో హౌసింగ్, వెల్ఫేర్, మున్సిపాలిటీ, ల్యాండ్​ సర్వే, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్లకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.  కాగా,  ఫిర్యాదులను కలెక్టర్​ అనురాగ్​ జయంతి స్వీకరించారు.