యాదాద్రి లక్ష్మీనారసింహుడి హుండీ ఆదాయం రూ.4.47కోట్లు

యాదాద్రి లక్ష్మీనారసింహుడి హుండీ ఆదాయం రూ.4.47కోట్లు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం హుండీని గురువారం (జూన్ 12) లెక్కించారు ఆలయ అధికారులు. భక్తులు సమర్పించిన 44 రోజుల హుండీలోని నగదు,బంగారం, వెండి లెక్కింపు చేశారు. ఆలయ ఈవో భాస్కర్ రావు సమక్షంలో ఈ హుండీ లెక్కింపు జరిగింది.

స్వామి హుండీ మొత్తం ఆదాయం 4కోట్ల 47లక్షల 66వేల 560 రూపాయల నగదు వచ్చినట్లు ఈవో తెలిపారు. 115 గ్రాముల మిశ్రమ బంగారం,6 కేజీల50 గ్రాముల మిశ్రమ వెండి, పలు దేశాల కరెన్సీని కానుకల రూపంలో భక్తులు సమర్పించినట్లు చెప్పారు ఆలయ ఈవో భాస్కర్ రావు.