పేరెంట్స్ కు రూ. 2 లక్షలు డిపాజిట్ చేయాలి : భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి

పేరెంట్స్ కు రూ. 2 లక్షలు డిపాజిట్ చేయాలి : భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి

యాదాద్రి, వెలుగు :  పేరెంట్స్​ పోషించడంతో పాటు ప్రతినెలా రూ. 2 వేల చొప్పున ఇవ్వాలని వారి సంతానాన్ని భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి ఆదేశించారు. రూ. 2 లక్షల చొప్పున డిపాజిట్​ చేయాలని ఆయన ఆదేశించారు. ‘తల్లిదండ్రులు, వయో వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం 2007’ కింద న్యాయం చేయాలని  వెల్ఫేర్​ ఆఫ్​ పేరెంట్స్​ సబ్​ డివిజనల్​ ట్రిబ్యునల్​ను పలువురు పేరెంట్స్ ఆశ్రయించారు. 

దీంతో ఆర్డీవో కృష్ణారెడ్డి శుక్రవారం పది కేసులను విచారించారు. ఇందులో ఆరుగురు పేరెంట్స్​కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేశారు. ఆత్మకూరు (ఎం) పల్లెర్లకు చెందిన గుండెబోయిన యాదయ్యకు ఆయన ఇద్దరు కుమారులు రూ. 2 వేల చొప్పున రూ. 4 వేలు జమ చేయాలని ఆదేశించారు. అదే విధంగా ఇద్దరు కలిసి రూ. 4 లక్షలు ఇవ్వాలన్నారు. ఇలా పలు కేసుల్లోనూ ఆయన ఆదేశాలు జారీ చేస్తూ, అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.