28 రోజుల్లో యాదాద్రి హుండీ ఆదాయం.. రూ. 3. 15 కోట్లు

28 రోజుల్లో యాదాద్రి హుండీ ఆదాయం.. రూ. 3. 15 కోట్లు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. గత 28 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో 3 కోట్ల 15 లక్షల 5 వేల 35 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.  కానుకల రూపంలో 100 గ్రాముల బంగారం,  4 కిలోల 250 గ్రాముల వెండిని కూడా భక్తులు సమర్పించారని వెల్లడించారు. అదేవిధంగా విదేశీ కరెన్సీ కూడా వచ్చిందని పేర్కొన్నారు. 

విదేశీ రూపాయలు :

  • అమెరికా - 2,006 డాలర్లు
  • యూఏఈ - 110  దిరామ్స్
  • ఆస్ట్రేలియా -355 డాలర్స్
  • కెనడా -195
  • సింగపూర్ - 30
  • ఇంగ్లాండ్ - 155
  • సౌదీ అరేబియా -20
  • యూరోప్ -5
  • ఒమన్  - 1600
  • మలేసియా - 13
  • నేపాల్ - 15
  • కత్తర్- 2
  • థాయిలాండ్ - 240
  • న్యూజిల్యాండ్- 50
  • కువైట్- 4
  • ఆఫ్రికా- 50
  • బంగ్లాదేశ్- 20
  • యుగాండా-  2000
  • ఇండోనేసియా- 11,000