ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం

 ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం

ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు - సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. కొత్త పార్టీల రాకపై తాము విశ్లేషించబోమని, తమ రాష్ట్ర అభ్యున్నతి తమకు ముఖ్యమని తెలిపారు. తమ విధానం తమకుందని, ప్రజల కోసం రాజకీయం చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలు తమకు మద్దతు ఇస్తారని నమ్ముతున్నామని, అంతిమ నిర్ణేతలు వారేనన్నారు.

పక్క రాష్ట్రాల గురించి తాము మాట్లాడటం లేదన్న సజ్జల .. వాళ్లు అక్కడి విషయాలు వదిలేసి తమ గురించి విమర్శలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. భవిష్యత్తు రాజకీయాల కోసం వాళ్లు అలా చేస్తున్నారేమో ఏమో కానీ తాము ఇక్కడి వ్యవహారాలకు మాత్రమే కట్టుబడి ఉన్నామని సజ్జల తెలిపారు. ఎంతమంది వచ్చినా ప్రజల్లో వైసీపీకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉందన్నారు.