బీజేపీ పవరేంటో తెలుసు.. అదో బలమైన శక్తి

బీజేపీ పవరేంటో తెలుసు.. అదో బలమైన శక్తి

కోల్ కతా: బెంగాల్ లో బీజేపీ ఓ బలీయమైన శక్తిలా మారుతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్న ప్రశాంత్ కిషోర్.. ఎన్నికల సమయంలో పైవ్యాఖ్యలు చేయడం ఆసక్తిని సంతరించుకుంది. 

క్లప్ బోర్డ్ అనే సోషల్ మీడియా యాప్ లో చాట్ చేస్తూ ఆయన ఈ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. 'నిజం చెప్పాలంటే బెంగాల్ లో బీజేపీ బలం పుంజుకుంటోంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అయినా బీజేపీ ఎంత యత్నించినా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 100 సీట్ల మార్కును దాటబోదు. తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించబోతోంది' అని సదరు చాట్ లో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు తెలుస్తోంది.