27న ఎల్​బీ  స్టేడియంలో యోగా మహోత్సవం

27న ఎల్​బీ  స్టేడియంలో యోగా  మహోత్సవం

ఖైరతాబాద్, వెలుగు: వచ్చే నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని -కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 27న ఎల్​బీ స్టేడియంలో యోగా మహోత్సవం నిర్వహించనున్నట్లు ప్రోగ్రామ్​ కన్వీనర్ పి.రవి కిశోర్ తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 .30 వరకు కార్యక్రమం ఉంటుందని, ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి స్కూళ్ల.. కాలేజీల స్టూడెంట్లు 50 వేల మందిదాకా హాజరవుతారని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆయుష్ మంత్రి, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఇందులో ఆధ్యాత్మిక సంస్థలైన పతంజలి ట్రస్ట్, బ్రహ్మకుమారీస్, శ్రీరామ చంద్ర మిషన్, ఆర్ట్​ఆఫ్ లివింగ్, ఈషా ఫౌండేషన్ సహకారం ఉంటుందన్నారు.