సీఎం పదవి కావాలంటే మమ్మల్నే అడగొచ్చుగా.. పైలెట్‌పై ఫైర్‌‌ అయిన కపిల్‌

సీఎం పదవి కావాలంటే మమ్మల్నే అడగొచ్చుగా.. పైలెట్‌పై ఫైర్‌‌ అయిన కపిల్‌
  • పలు ప్రశ్నలు వేసిన సిబల్

న్యూఢిల్లీ: సొంత పార్టీపై తిరుగుబాటు చేసిన సచిన్‌పైలెట్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత, సీనియర్‌‌ లాయర్‌‌ కపిల్‌ సిబల్‌ ఫైర్‌‌ అయ్యారు. 20 – 25 మంది ఎమ్మెల్యేలతోనే సీఎం అయిపోతావా అంటూ ప్రశ్నించారు. పార్టీనీ పబ్లిక్ ముందు తమాషా చేయొద్దని అన్నారు. “ సచిన్‌ నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు సీఎం అవ్వాలని అనుకుంటున్నవా? మాకు చెప్పు. ఈ తిరుగుబాటు ఎందుకు? బీజేపీతో కలవను అని చెప్తున్న నువ్వు హర్యానాలో ఎందుకు ఉన్నావు. పార్టీ సమావేశాలకు ఎందుకు రాను అంటున్నావు. సొంత పార్టీ పెట్టాలనుకుంటున్నావా? మరి బయటికి వచ్చి మాట్లాడు” అని కపిల్‌సిబల్‌ అన్నారు. సొంత పార్టీపై తిరుగుబాటు చేసిన సచిన్‌పైలెట్‌ తన తరఫు ఎమ్మెల్యేలతో హర్యానాలోని ఉంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వారికి నోటీసులు ఇవ్వడంతో కోర్టుకు వెళ్లగా సచిన్‌ వర్గానికి కోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్‌ తరఫున కేసును కపిల్‌ సిబల్‌ వాదిస్తున్నారు.