ఉద్యోగం రాలేదని సిద్దిపేటలో యువకుడి ఆత్మహత్య 

ఉద్యోగం రాలేదని సిద్దిపేటలో యువకుడి ఆత్మహత్య 

ఉద్యోగం రాలేదని వేదనతో సిద్దిపేట జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దుబ్బాక మండలం పెద్దగుండవెల్లికి చెందిన బిర్లా శ్రీకాంత్ తన పొలం దగ్గర చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిరోజులుగా కానిస్టేబుల్ ఉద్యోగం కోసం హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్నాడని.. ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడని బంధువులు చెబుతున్నారు. తర్వాత సిద్దిపేటకు వచ్చి కానిస్టేబుల్ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటున్నాడని.. నోటిఫికేషన్లు రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. శ్రీకాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

రాష్ట్రంలో కొత్తగా 288 బస్తీ దవాఖానాలు