హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ సైడ్ వాల్​ను ఢీకొట్టిన స్కూటీ

హైటెక్ సిటీ ఫ్లై ఓవర్  సైడ్ వాల్​ను ఢీకొట్టిన స్కూటీ
  • కిందపడి యువతి మృతి.. 
  • యువకుడికి గాయాలు సైబర్ టవర్స్ వద్ద ఘటన

మాదాపూర్, వెలుగు:  సైబర్​ టవర్స్​ ఫ్లై ఓవర్​పై ఓ యువకుడు వేగంగా స్కూటీని నడిపి సైడ్​వాల్​ను ఢీకొట్టాడు. ప్రమాదంలో స్కూటీపై వెనుకాల కూర్చున్న యువతి ఫ్లై ఓవర్​ పై నుంచి కిందపడి చనిపోగా..యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్​స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం..​ కోల్​కతాకు చెందిన స్వీటీ పాండే లోయర్ ట్యాంక్​బండ్​లో ఉంటూ మ్యారియట్ హోటల్​లో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. 

అదే హోటల్​లో పనిచేసే తన ఫ్రెండ్ రాయన్ ల్యూకెతో కలిసి టిఫిన్ కోసం గురువారం 
తెల్లవారుజామున స్కూటీపై జేఎన్టీయూ నుంచి ఐకియా వైపు బయలుదేరింది. రాయన్ స్కూటీని డ్రైవ్ చేస్తుండగా.. స్వీటీ పాండే వెనుకాల కూర్చుంది. 4 గంటలకు సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్​పై రాయన్ ఓవర్ స్పీడ్​తో స్కూటీని డ్రైవ్ చేశాడు. దీంతో బైక్ అదుపుతప్పి సైడ్​వాల్​ను ఢీకొట్టింది. స్వీటీ ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడింది. రాయన్ ఫ్లై ఓవర్​పైనే పడిపోయాడు. గాయపడ్డ వీరిద్దరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఉదయం 9.22 గంటలకు హాస్పిట
ల్​లో స్వీటీ మృతి చెందింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.