- కిందపడి యువతి మృతి..
- యువకుడికి గాయాలు సైబర్ టవర్స్ వద్ద ఘటన
మాదాపూర్, వెలుగు: సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్పై ఓ యువకుడు వేగంగా స్కూటీని నడిపి సైడ్వాల్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో స్కూటీపై వెనుకాల కూర్చున్న యువతి ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడి చనిపోగా..యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కోల్కతాకు చెందిన స్వీటీ పాండే లోయర్ ట్యాంక్బండ్లో ఉంటూ మ్యారియట్ హోటల్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది.
అదే హోటల్లో పనిచేసే తన ఫ్రెండ్ రాయన్ ల్యూకెతో కలిసి టిఫిన్ కోసం గురువారం
తెల్లవారుజామున స్కూటీపై జేఎన్టీయూ నుంచి ఐకియా వైపు బయలుదేరింది. రాయన్ స్కూటీని డ్రైవ్ చేస్తుండగా.. స్వీటీ పాండే వెనుకాల కూర్చుంది. 4 గంటలకు సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్పై రాయన్ ఓవర్ స్పీడ్తో స్కూటీని డ్రైవ్ చేశాడు. దీంతో బైక్ అదుపుతప్పి సైడ్వాల్ను ఢీకొట్టింది. స్వీటీ ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడింది. రాయన్ ఫ్లై ఓవర్పైనే పడిపోయాడు. గాయపడ్డ వీరిద్దరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఉదయం 9.22 గంటలకు హాస్పిట
ల్లో స్వీటీ మృతి చెందింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.