హైదరాబాద్లో డీజే సౌండ్కు ఆగిన యువకుడి గుండె.. గణేశుని ఆగమనం శోభాయాత్రలో డ్యాన్స్ చేస్తూ..

హైదరాబాద్లో డీజే సౌండ్కు ఆగిన యువకుడి గుండె.. గణేశుని ఆగమనం శోభాయాత్రలో డ్యాన్స్ చేస్తూ..

ముషీరాబాద్, వెలుగు: ముషీరాబాద్‌‌‌‌‌‌‌‌ రాంనగర్‌‌‌‌‌‌‌‌లో విషాదం చోటుచేసుకుంది. శ్రీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి (సెప్టెంబర్ 05) నిర్వహించిన గణేశ్​ఆగమనం శోభాయాత్రలో భారీ డీజే సౌండ్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా డ్యాన్స్​ చేస్తూ స్థానిక యువకుడు బద్రీనాథ్​(20) అకస్మాత్తుగా కిందపడిపోయాడు.

అతన్ని కొందరు పక్కనే మూసి ఉన్న దుకాణాల ముందు పడేశారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అతన్ని అంబులెన్స్‌‌‌‌‌‌‌‌లో గాంధీ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

మరోవైపు, త్రిశూల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేశ్​ మండప ఏర్పాట్లు చేస్తున్న ఓ వ్యక్తి విద్యుత్ షాక్​కు గురై గాయపడ్డాడు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. ఇంత జరిగినా నిర్వాహకులపై ముషీరాబాద్, వారాసిగూడ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.