అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి

అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి

అమెరికాలోని ఎల్లికాట్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం తెరాటి గూడెం కు చెందిన 28 ఏళ్ల మండలి  శేఖర్.. గత రెండేళ్లుగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు.  దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. శేఖర్ మరణవార్తను అమెరికా అధికారులు.. అతడి తల్లిదండ్రులకు తెలియజేశారు. తమ కుమారుడి మృతదేహం అమెరికాలో ఉందని, భారత్ కు తీసుకువచ్చేందుకు సాయపడాలని అతడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.