ఘట్కేసర్, వెలుగు: క్వారీ గుంతలో యువకుడు గల్లంతైన ఘటన ఘట్కేసర్పోలీస్స్టేషన్పరిధిలో జరిగింది. సీఐ అశోక్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి నియోజకవర్గంలోని సఫీల్గూడ డీఏవీ స్కూల్ కాలనీకి చెందిన అంకిరెడ్డి మహేశ్(23), జాఫర్, నాయన్రాజ్, ఎండీ సమీర్, రంజిత్ స్నేహితులు. ఈత కొట్టేందుకు ఆదివారం మధ్యాహ్నం రెండు బైక్లపై పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ సమీపంలోని సత్తిరెడ్డి క్వారీ గుంత వద్దకు వెళ్లారు.
అంతా కలిసి నీటిలో దిగి ఈత కొడుతుండగా మహేశ్మునిగిపోయాడు. స్నేహితులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్సిబ్బంది వచ్చి సాయంత్రం వరకు గాలించినా మహేశ్ ఆచూకీ దొరకలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలు ఆపారు. సోమవారం ఉదయం తిరిగి గాలిస్తామని సీఐ అశోక్రెడ్డి తెలిపారు.