క్వారీ గుంతలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

క్వారీ గుంతలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

ఘట్​కేసర్, వెలుగు: క్వారీ గుంతలో యువకుడు గల్లంతైన ఘటన ఘట్​కేసర్​పోలీస్​స్టేషన్​పరిధిలో జరిగింది. సీఐ అశోక్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి నియోజకవర్గంలోని సఫీల్​గూడ  డీఏవీ స్కూల్ కాలనీకి చెందిన అంకిరెడ్డి మహేశ్(23), జాఫర్, నాయన్​రాజ్, ఎండీ సమీర్, రంజిత్ స్నేహితులు. ఈత కొట్టేందుకు ఆదివారం మధ్యాహ్నం రెండు బైక్​లపై పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ సమీపంలోని సత్తిరెడ్డి క్వారీ గుంత వద్దకు వెళ్లారు. 

అంతా కలిసి నీటిలో దిగి ఈత కొడుతుండగా మహేశ్​మునిగిపోయాడు. స్నేహితులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్​సిబ్బంది వచ్చి సాయంత్రం వరకు గాలించినా మహేశ్ ఆచూకీ దొరకలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలు ఆపారు. సోమవారం ఉదయం తిరిగి గాలిస్తామని సీఐ అశోక్​రెడ్డి తెలిపారు.