
భార్య గొడవ పడిందని ఓ యువకుడు మద్యంమత్తులో ఏకంగా రైలును అడ్డగించాడు. ఈ ఘటన చెన్నై శివగంగై జిల్లాలో జరిగింది. మానామదురై సమీపంలోని ఏనాది చెంగోట్టైకు చెందిన షణ్ముగవేల్ (26) శుక్రవారం భార్యతో గోడవపడి తన బైక్ పై తిరుభువనం చేరుకున్నాడు. అక్కడి లాడనేందల్ రైల్వే వంతెన కింద మందు కొట్టి.. ఆ రాత్రి అక్కడే ఉండి…శనివారం ఉదయం బైకును తీసుకెళ్లి అక్కడి రైలు పట్టాలపై నిలిపి దానిపైనే కూర్చున్నాడు. ఉదయం 7.40 గంటలకు మదురై నుంచి రామేశ్వరం వెళ్లే రైలు అటుగా వచ్చింది. కొద్ది దూరంలోనే పట్టాలపై బైక్ సహా వ్యక్తి ఉండటాన్ని గమనించిన డ్రైవర్ అలర్టై రైలును నిలిపివేశాడు. రైళ్లోంచి దిగిన ప్రయాణికులు విషయం తెలుసుకున్నారు. షణ్ముగవేల్కు నచ్చచెప్పడానికి ఎంత ప్రయత్నించినా వినకపోవడంతో … రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. అయితే అప్పటికే షణ్ముగవేల్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనతో సుమారు అరగంట ఆలస్యంగా రైలు నడిచింది. మానామదురై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని షణ్ముగవేల్ కోసం గాలిస్తున్నారు.