మద్యం మత్తులో యువకుల వీరంగం..కారు అద్దాలు ధ్వంసం, ముగ్గురిపై దాడి

మద్యం మత్తులో యువకుల వీరంగం..కారు అద్దాలు ధ్వంసం, ముగ్గురిపై దాడి

చేవెళ్ల, వెలుగు: మద్యం మత్తులో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. చేవెళ్లకు చెందిన మహ్మద్ శఫియోద్దీన్, అతని కొడుకు తఖియోద్దీన్, మరో వ్యక్తి మహ్మద్ హుస్సేన్ కలిసి బక్రీద్ పండుగ నేపథ్యంలో శుక్రవారం రాత్రి గొర్రెల కొనుగోలుకు కారులో ఏనికెపల్లికి బయలుదేరారు. మార్గమధ్యలో ఊరెళ్ల వద్ద గూడెపు శ్రీను, కిరణ్​తోపాటు ఐదుగురు యువకులు తప్పతాగి రోడ్డుపై అడ్డుగా బైక్ నిలిపారు. హారన్ కొట్టినా జరగకపోవడంతో బాధితులు వాగ్వాదానికి దిగారు. దీంతో వారిపై దాడి చేసి, కారు అద్ధాలు ధ్వంసం చేశారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.