
జీడిమెట్ల, వెలుగు: కుటుంబసభ్యులు ఇష్టం లేని పెండ్లి చేశారని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మి అలియాస్ పూజ(25)కు గతేడాది డిసెంబర్14న హరికృష్ణతో వివాహం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దంపతులు సుభాష్నగర్ కు వచ్చి, ఓ అపార్ట్మెంట్ లో ఐదో అంతస్తులోని ఫ్లాట్లో ఉంటున్నారు. హరికృష్ణ ఓ ప్రైవేట్ కంపనీలో అకౌంటెంట్. కాగా, లక్ష్మికి ఈ వివాహం ఇష్టం లేదు.
పెళ్లయినప్పటి నుంచి దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. ఆదివారం ఉదయం 5 గంటలకు ఆమె తమ ఫ్లాట్లోని కిటికీలో నుంచి దూకి, ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.