ఎండ వేడి నుంచి రక్షణగా..హెల్మెట్​కు కార్టూన్ ​బొమ్మలు

ఎండ వేడి నుంచి రక్షణగా..హెల్మెట్​కు కార్టూన్ ​బొమ్మలు

ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్​ జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇంద్రవెల్లి మండలం పిట్ట బొంగరం గ్రామానికి చెందిన యువకులు ఎండ వేడిని తట్టుకునేందుకు ఇలా హెల్మెట్​కు కార్టూన్ ​బొమ్మలు ధరించి ప్రయాణిస్తూ కనిపించారు. వడగాలుల నుంచి కాపాడుకునేందుకు ఇలా చేసినట్లు చెప్పారు.
– వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్