గచ్చిబౌలి, వెలుగు: సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు, పరువు నష్టం కలిగించే పోస్టులు పెట్టిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన గౌరవానికి భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గత డిసెంబర్లో అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కడప జిల్లాకు చెందిన జనార్దన్ (29) ప్రస్తుతం గచ్చిబౌలిలో నివసిస్తూ ఇన్స్టాగ్రామ్ ద్వారా అనసూయపై దూషణలకు పాల్పడటమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో అసభ్యకర వీడియోలను సృష్టించి ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మరో కేసులో సోషల్ మీడియాలో సినీనటులు పోస్టులకు అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్న వ్యక్తి వెస్ట్మారేడ్ పల్లికి ఆటో డ్రైవర్ అరుణ్ కుమార్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
