హైదరాబాద్, వెలుగు: యూత్ డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త్వరలో బస్సు యాత్ర చేపడతామని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్నియోజకవర్గం గజ్వేల్ నుంచే యాత్రను ప్రారంభిస్తామని తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని ఓ హోటల్లో యూత్కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శివసేనా రెడ్డి మాట్లాడారు. యూత్ కమిషన్ ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు కాంగ్రెస్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో యూత్కు ఎక్కువ టికెట్లు కేటాయించే అంశంపై చర్చిస్తామని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాగా, వచ్చే నెలలో నిర్వహించనున్న యూత్ కన్వెన్షన్పై చర్చ జరిగిందని, చత్తీస్గఢ్లో నిర్వహించిన పార్టీ చింతన్ శివిర్లో యూత్కు 50 శాతం టికెట్లు ఇవ్వాలని ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలిపామని నేతలు చెప్పారు.