త్వరలో యూత్ కాంగ్రెస్ బస్సు యాత్ర : శివసేనా రెడ్డి 

త్వరలో యూత్ కాంగ్రెస్ బస్సు యాత్ర : శివసేనా రెడ్డి 


హైదరాబాద్, వెలుగు: యూత్ డిక్లరేషన్​ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త్వరలో బస్సు యాత్ర చేపడతామని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్​నియోజకవర్గం గజ్వేల్​ నుంచే యాత్రను ప్రారంభిస్తామని తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని ఓ హోటల్​లో యూత్​కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శివసేనా రెడ్డి మాట్లాడారు. యూత్ కమిషన్ ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు కాంగ్రెస్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో యూత్​కు ఎక్కువ టికెట్లు కేటాయించే అంశంపై చర్చిస్తామని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాగా, వచ్చే నెలలో నిర్వహించనున్న యూత్ కన్వెన్షన్​పై చర్చ జరిగిందని, చత్తీస్​గఢ్​లో నిర్వహించిన పార్టీ చింతన్​ శివిర్​లో యూత్​కు 50 శాతం టికెట్లు ఇవ్వాలని ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలిపామని నేతలు చెప్పారు.