కాళేశ్వరం, మిషన్ భగీరథలలో దోచుకున్న డబ్బుతోనే బీఆర్ఎస్ పెట్టిండు : షర్మిల

  కాళేశ్వరం, మిషన్  భగీరథలలో దోచుకున్న డబ్బుతోనే బీఆర్ఎస్ పెట్టిండు : షర్మిల

కాళేశ్వరం, మిషన్  భగీరథ పేర్లతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారని వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.  అలా దోచుకున్న డబ్బుతోనే టీఆర్ఎస్ ను  బీఆర్ఎస్ గా మార్చారని అన్నారు. గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించిన షర్మిల..   అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనపై పది ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రాన్ని విడుదల చేశారు.  కేసీఆర్ దగా.. ఈ పది ప్రశ్నలకు సమాధానం  చెప్పగలరా అంటూ షర్మిల ప్రశ్ని్ంచారు.  

కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఏం చేశాడని  రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందా అని షర్మిల ప్రశ్ని్ంచారు.  కేసీఆర్ మిగుల బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని, ఇప్పుడు ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తెచ్చిండని విమర్శించారు.  కేసీఆర్ పాలనలో  డబుల్ బెడ్రూమ్, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం ఏమైందని షర్మిల ప్రశ్ని్ంచారు. కల్వకుంట్ల ఫ్యామిలో అందరికీ పదువులున్నాయి కానీ తెలంగాణ బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవని చెప్పారు.