హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ మహిళలకు 33% రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్సీ కవితను వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల నిలదీశారు. 115 సీట్లల్లో 7 టికెట్లు ఇస్తే మహిళలపై బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉన్నట్లా అని మంగళవారం ట్విట్టర్లో ప్రశ్నించారు. ఆకాశంలో, అధికారంలో సగం సగమని నీతులు చెప్పిన మీరే.. మహిళలకు 6% సీట్లు కేటాయిస్తే ఎలా అని మండిపడ్డారు. ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలన్నారు.
తెలంగాణ జనాభాలో 50 శాతమున్న మహిళలకు కేబినెట్లో ప్రాధాన్యం దక్కడం లేదన్నారు. లిక్కర్, రియల్ ఎస్టేట్ బిజినెస్ల గురించి కాకుండా బీఆర్ఎస్లో మహిళలకు రిజర్వేషన్లపై కవిత ఫోకస్ పెట్టాలని సూచించారు. లిక్కర్ స్కామ్ను పక్కదారి పట్టించేందుకే 33% రిజర్వేషన్ల నాటకమని తెలిపారు.