దొంగే భుజాలు తడుముకున్నట్లుంది..: వైఎస్​ షర్మిల

దొంగే భుజాలు తడుముకున్నట్లుంది..: వైఎస్​ షర్మిల

‘దళారి దొంగలు, కొత్త వేషగాళ్లు, దోపిడీదారులు' అంటూ సీఎం కేసీఆర్​ మాట్లాడుతుంటే దొంగలే భుజాలు తడుముకున్నట్లు ఉందని వైఎస్​ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.  సీఎంకు పలు ప్రశ్నలతో కూడిన ట్వీట్​ను ఆమె సంధించారు.  అవేంటంటే.. 

'1.కోట్ల మంది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా దోచుకుంటున్నది బీఆర్​ఎస్ సర్కార్​ కాదా?
2. నీళ్లు ఫాం హౌజ్​కి, నిధులు సొంత ఖజానాకు
3. సొంత కుటుంబానికి ఉద్యోగాలు.. తెలంగాణ యువతకేవీ?
4. కేసీఆర్​అండ్​ కో కన్నా దళారి ఎవరు?
5. బంగారు రాష్ట్రాన్ని అప్పలు పాలు చేసిందెవరు?
6.బడి నుంచి సాగుబడి దాకా ప్రాజెక్టులపై రూ.లక్షల కమీషన్లు తిన్న దోపిడీదారులు మీరె
7. పార్టీ కార్యాలయాలకు చౌకగా భూ కేటాయింపు చేసిన బీఆర్​ఎస్​ ది దళారి పాలన
8. -కాంట్రాక్టర్ల బిల్లుల్లో 30% కమీషన్లు
9. ఇసుక,మట్టి, మాఫియాతో వేల కోట్లు దోచుకు తింటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అతి పెద్ద దళారులు. 
 10. ఎన్నికల సమయంలోనే ప్రజలకు కనిపించి, పూటకో మాట, గడికో హామీ.. అంటూ మస్త్ మాటలు చెప్పే అసలైన పగటి వేషగాడు కేసీఆర్.'  అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న బీఆర్​ఎస్​ సర్కార్​కు రోజులు దగ్గరపడ్డాయని వైఎస్​ షర్మిల ట్వీట్​లో విమర్శించారు.