సీఎం కేసీఆర్ తెలంగాణను ఆఫ్ఘనిస్తాన్ లాగా మార్చారని, తాలిబన్ల నాయకుడు కేసీఆర్ అని వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందన్నారు. బోడుప్పల్ అభయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అడ్వకేట్ యుగంధర్ ను షర్మిల వెళ్లి పరామర్శించారు. ఆయన అరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షర్మిల.. దళితబంధులో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తే సర్కార్ ఇచ్చిన బహుమతి దాడి చేయడమేనా అని ప్రశ్నించారు.
దళిత బిడ్డ మీద దాడులు జరిగితే పోలీసులు కేసు కూడా నమోదు చేసుకోలేదన్నారు. దళితులను కేసీఆర్ మోసం చేశాడని షర్మిల...రాష్ట్రంలో - దళితులకు కనీస గౌరవం కూడా లేదన్నారు. దళితులంటే ఓట్లేసే యంత్రం లాగే చూస్తున్నారని, దళితుల కోసం పెట్టిన ప్రతి పథకమూ మోసమేనని అన్నారు. కేసీఅర్ దళిత ద్రోహి అని మండిపడ్డారు. -
పోలీసులను సైతం కేసీఆర్ ప్రైవేటు సైన్యం లాగా వాడుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. తిరుమలగిరిలో అఖిలపక్షం అధ్వర్యంలో ధర్నా చేద్దామని చేద్దామని అనుకున్నామని కానీ పోలీసులు తమ ధర్నాకు అనుమతి ఇవ్వలేదన్నారు. - బంగారు తెలంగాణలో ప్రజల పక్షాన నిలబడటం ఘోరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోరాటం చేయాలంటే ప్రతిపక్షాలకు స్వేచ్ఛలేదనన్నారు షర్మిల.