నా కొడుకు పెళ్లికి రండి.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి షర్మిల ఆహ్వానం

నా కొడుకు పెళ్లికి రండి.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి షర్మిల ఆహ్వానం

చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని వైఎస్ షర్మిల కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా రావాలని  ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు షర్మిల శుభలేఖను అందించారు.  అనంతరం ఇరువురు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు.

వైఎస్ రాజారెడ్డి పెండ్లి అట్లూరి ప్రియతో నిశ్చయమైంది. జనవరి 18న ఎంగేజ్ మెంట్, ఫిబ్రవరి  17న పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం, ఏపీ సీఎంతో సహా పలువురు రాజకీయ ప్రముఖులకు ఇప్పటికే షర్మిల శుభలేఖలు అందించారు.  

వైఎస్‌ రాజా రెడ్డి అమెరికాలోని డ‌ల్లాస్ యూనివ‌ర్సిటీలో బ్యాచిల‌ర్ ఆండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ కోర్సును పూర్తి చేశారు. యూనివ‌ర్సిటీ నుంచి ఇటీవల ప‌ట్టా కూడా అందుకున్నారు.  ప్రియా అట్లూరి కూడా అమెరికాలోని పేరున్న విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పలువురు ప్రముఖులను, దగ్గరి బంధువులను నిశ్చితార్దానికి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.