ఆ కాలం కూడా వెళ్లిపోతుంది దొర

ఆ కాలం కూడా వెళ్లిపోతుంది దొర

తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత్రి  వైఎస్ షర్మిల మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. యాసంగి పంటలు వేసుకునే కాలం ఇది అని చెప్పిన కేసీఆర్ కు ఆ కాలం కూడా వెళ్లిపోతుంది అనన విషయం తెలియడం లేదా అంటూ నిలదీశారు. ట్వీట్టర్లో షర్మిల ట్వీట్ చేశారు. ‘ఇది యాసంగి పంటలు వేసుకునే కాలం అని చెప్పిన మీకు, ఆ కాలం కూడా వెళ్లిపోతుంది అని తెలియడం లేదా దొరా? పంట వేసుకోవాల్సిన రైతు ఇంకా వానాకాలం పంట అమ్ముడుపోక, కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తుండు. చివరి గింజ వరకు కొంటాం అని చెప్పిన మాటల మొనగాడు, ఇప్పటి వరకు కొన్నది 30 శాతమే.కొంటాడో కొనడో తెలియక ధాన్యం కుప్పల మీదే రైతు గుండెలు ఆగిపోతుంటే KCR గారు మాత్రం ధాన్యం కొనకుండా రాజకీయాలు చేస్తున్నాడు. ఇప్పటికే 2 నెలలుగా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ రైతులు గోస పడుతున్నారు. రైతులు తిరగపడక ముందే పంట మొత్తం కొనాల్సిందే. లేకపోతే KCR మూట ముళ్ళె సర్దుకోవాల్సిందే.’ అంటూ షర్మిల సీఎంను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.