ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల, విజయమ్మ

ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల, విజయమ్మ

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇడుపులపాయలోని తన భూములను కొడుకు, కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.హైదరాబాదు నుంచి  ప్రత్యేక విమానంలో షర్మిల, విజయమ్మ  కడపకు చేరుకుని అక్కడ నుంచి నేరుగా వేంపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.అక్కడ తన పేరుతో ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగముని రెడ్డి నుంచి షర్మిల కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలి రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.

ఆ తర్వాత వేంపల్లి రిజిస్ట్రేషన్ నుంచి షర్మిల కుటుంబ సభ్యులు ఇడుపులపాయ ఎస్టేట్ కి చేరుకోవడం జరిగింది. శనివారం( జులై8) వైయస్ జయంతి సందర్భంగా తండ్రి సమాధి వద్ద వైయస్ షర్మిల , విజయమ్మ నివాళులర్పించనున్నారు.  ప్రతి ఏడాది నిర్వహించినట్లే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.ఈ క్రమంలో షర్మిల తండ్రి వైయస్ జయంతి నాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అంశంపై కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.