బీసీలకు పదవులు ఇవ్వకుండా మోసం చేస్తున్నరు

బీసీలకు పదవులు ఇవ్వకుండా మోసం చేస్తున్నరు

హైదరాబాద్: బీసీల సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పే దొరకు.. బీసీలకు లోన్లు ఇవ్వడానికి పైసలు ఉండవని ఎద్దేవా చేశారు. దొర గెలిచేందుకు ఓట్లేసే ఓటర్లు తప్ప బీసీలు దొరకు అక్కర్లేదన్నారు. వాళ్ల సంక్షేమం పట్టింపు లేదన్నారు. బీసీ బిడ్డల ఫీజులు కట్టేందుకు డబ్బులు ఉండవన్నారు. బీసీల కోసం ఆత్మగౌరవ భవనాలు కట్టేందుకు సర్కారు దగ్గర డబ్బులు ఉండవన్నారు. ఆత్మగౌరవ భవనాలకు ముగ్గు పోసి వదిలేసి, మురిపించి వాడుకోవడం.. సంఘాల పేరుతో విభజించడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. బీసీల జనాభా ప్రాతిపదికన వాళ్లకు సీట్లు కేటాయించకుండా.. వారికి పదవులు ఇవ్వకుండా మోసం చేస్తున్న సర్కార్ ఇది అని దుయ్యబట్టారు. బీసీల కనీస అవసరాలు తీర్చలేని సీఎం మనకొద్దు అని ట్వీట్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం: 

‘వారియర్’గా వస్తానంటున్న ఇస్మార్ట్ హీరో

ఆర్మీ అఫీసర్ ఇంట్లో కోట్ల నగదు

వ్యాక్సిన్ తీసుకోవాలని బలవంతం చేయం