
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లిపీఠలు ఎక్కుబోతున్నారు. జనవరి 18న అట్లూరి ప్రియతో తన కొడుకు ఎంగేజ్ మెంట్ , ఫిబ్రవరి 17న పెళ్లి జరగబోతున్నట్లు షర్మిల తన ట్విట్టర్లో ప్రకటించారు. జనవరి 2న కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో తాము ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ ని సందర్శిస్తామని తెలిపారు. తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ దగ్గర పెట్టి తన తండ్రి వైఎస్సార్ ఆశీస్సులు తీసుకుంటామని చెప్పారు. తన కొడుకు పెళ్లి వేడుక విషయాలను మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు.
వైఎస్ రాజారెడ్డి చేసుకోబోయే అమ్మాయితో కలిసి ఉన్న ఫోటోలు కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. వీరిది ప్రేమ వివాహమని..ఇరు కుటుంబాలు వారి పెళ్లికి ఒప్పుకున్నాయని టాక్ వినిపిస్తోంది.
అమెరికాలో స్థిరపడ్డ అట్లూరి శ్రీనివాస్ , అట్లూరి మాధవి దంపతుల కుమార్తె ప్రియా. వీళ్ల స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా.. అట్లూరి శ్రీనివాస్ ది విజయవాడ, ఆయన భార్య మాధవిది ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు. అమెరికాలో స్థిరపడ్డారు.
Wishing everyone a blessed 2024! Delighted to share the news of my son YS Raja Reddy’s engagement to his sweetheart Atluri Priya on January 18th, with their wedding set for February 17th, 2024.
— YS Sharmila (@realyssharmila) January 1, 2024
Tomorrow, we’ll visit YSR ghat at Idupulapaya, accompanied by the soon-to-be bride… pic.twitter.com/JVp91hppsi