లోటస్ పాండ్ వద్ద పోలీసుల బందోబస్తు

లోటస్ పాండ్ వద్ద పోలీసుల బందోబస్తు

వైఎస్పార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ చేరుకోనున్నారు. మహబూబాబాద్‭లో షర్మిల పాద్రయాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేయడంతో ఆమె తిరిగి హైదరాబాద్‭కు వస్తున్నారు. ఇక్కడికి చేరుకున్న వెంటనే షర్మిల ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ ఆఫీస్ అయిన లోటస్ పాండ్ వద్దకు పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ కార్యకర్తల్ని వైఎస్సార్టీపీ ఆఫీసు వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ధర్నాలు చేసినా.. పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చినా అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. లోటస్ పాండ్ లైన్ వద్ద బైకులను అడ్డుపెట్టి.. వాహనాల దారిని మళ్లిస్తున్నారు.  పోలీసులు అరెస్టు చేస్తారని.. కొందరు అభిమానులు, పార్టీ కార్యకర్తలు లోటస్ పాండ్ చుట్టుపక్కల తిరుగుతున్నట్లు సమాచారం. షర్మిల పార్టీ ఆఫీసుకు వచ్చిన తర్వాత వీరంతా భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.