తాటాకు చప్పుళ్లకు భయపడ.. శంకర్ నాయక్కు షర్మిల సవాల్

తాటాకు చప్పుళ్లకు భయపడ.. శంకర్ నాయక్కు షర్మిల సవాల్

కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలకు  వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కౌంటర్ వేశారు.  శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో  చూస్తా అంటూ సవాల్ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఈ వైఎస్సార్ బిడ్డ అని ధ్వజమెత్తారు.  మహబూబాబాద్ జిల్లా నెళ్ళికుదురు మండల కేంద్రంలో మాట్లాడిన షర్మిల.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మాటలతో ఎదురు దాడి చేశారు.

‘శంకర్ నాయక్ బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నాడు. పాదయాత్రను అడ్డుకునేలా కార్యకర్తలను ఉసి గొల్పుతున్నారు.  శంకర్ నాయక్ సైగ చెయ్ ఎవగడొస్తాడో చూస్త. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఈ వైఎస్సార్ బిడ్డ. ప్రజల పక్షాన నిలబడి, కొట్లాడుతున్నందుకు భయపడాలా..?. మీరు చేసిన మోసాలు ఎత్తి చూపిస్తున్నందుకు భయపడాలా..?. మీ నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలు. శంకర్ నాయక్ ఒక కబ్జా కోర్. జనాల దగ్గర భూములు గుంజుకోడమే ఆయనకు తెలుసు.’ ’అంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.