షర్మిల ఏ పార్టీలో చేరితే మాకేంటి సంబంధం:వైవీ సుబ్బారెడ్డి

షర్మిల ఏ పార్టీలో చేరితే మాకేంటి సంబంధం:వైవీ సుబ్బారెడ్డి

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(YSRTP Chief YS Sharmila Reddy) చేరికపై వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి (YCP Regional Coordinator YV Subbareddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్​ పార్టీలో చేరితే మాకేంటి సంబంధమంటూ ...ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా చేరినా ప్రజల ఆశీస్సులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పైనే ఉన్నాయి అన్నారు వైవీ సుబ్బారెడ్డి.. జగన్ కాకుండా వేరే వాళ్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయితే పేద కుటుంబాలు నష్ట పోతాయని.. అందుకే ప్రజల ఆశీస్సులు మాతోనే ఉంటాయి అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరినా వైసీపీకి (YCP) ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు తమకు తోడుగా నిలబతాయన్నారు. అత్యధిక స్థానాలు వైసీపీ గెలుస్తుందని.. జగన్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో బీసీలకు టిక్కెట్ ఇవ్వడం కోసం ఆర్కేకి ఇవ్వలేదన్నారు.

ఆర్కే మనస్తాపం చెంది బయటకు వెళ్తానంటే వెళ్లనివ్వండని అన్నారు. చాలా చోట్ల టిక్కెట్లు దక్కలేదని వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నారని తెలిపారు. నియోజక వర్గల్లో మార్పులు, చేర్పులు ఎన్నికల వరకు సాగుతాయన్నారు. 175 స్థానాల్లో గెలవడం వైసీపీ టార్గెట్ అని వైవీ సుబ్బారెడ్డిచెప్పుకొచ్చారు. 

  • ALSO READ | రాహుల్ ను ప్రధాని చేయడం మా నాన్న కల : షర్మిల