కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగోను ఆ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. ఈ రోడ్ షో దేశంలోని 15 రాష్ట్రాల గుండా కొనసాగనున్నదని తెలిపారు.
ఈ యాత్ర మణిపూర్ లోని ఇంఫాల్ లో ప్రారంభమై, ముంబైలో ముగుస్తుందని చెప్పారు. 110 జిల్లాలు, 100 లోక్ సభ, 337 అసెంబ్లీ సీట్లను కవర్ చేస్తూ సాగుతుందని పేర్కొన్నారు.