- ఆర్మూర్లో హైటెక్ ఫిష్ మార్కెట్నిర్మాణానికి రూ.1.20 కోట్లు మంజూరు
- పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్
ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పీసీసీ ప్రెసిడెంట్మహేశ్ గౌడ్ అన్నారు. జిల్లా మత్స్య సంఘం ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్లో మహేశ్ గౌడ్ను కలిశారు. అర్సపల్లిలోని ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి చెందిన భూమి ఆక్రమణకు గురవుతోందని, ఆర్మూర్లో చేపల మార్కెట్ నిర్మాణం పెండింగ్లో ఉందని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ డైరెక్టర్బట్టు సాయిరాం, న్యాలకంటి వాసు పీసీసీ ప్రెసిడెంట్కు వివరించారు. స్పందించిన ఆయన వెంటనే మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో మట్లాడి సమస్య వివరించి నిధులు మంజూరుకు సిఫారు చేశారు.
అర్సపల్లిలోని చేపల ఉత్పత్తి కేంద్రం భూమి ఆక్రమణకు గురికాకుండా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.77 లక్షలు, ఆధునిక చేపల మార్కెట్ నిర్మాణానికి రూ.1.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారని సాయిరాం, వాసు చెప్పారు. నిధులు మంజూరుకు కృషి చేసిన పీసీసీ చీఫ్, మంత్రి వాకిటికి ధన్యవాదాలు తెలిపారు.
