పూణె మెట్రో అధికారులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికంగా ఆదాయాన్ని రాబట్టే దిశగా.. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే రూ. 85లు, స్టేషన్ లో టికెట్ కొన్న తరువాత 20 నిమిషాలు దాటి ఉంటే రూ. 10 నుంచి రూ. 50 వరకు ఫైన్ఖ విధించేందుకు నిర్ణయం తీసుకుంది.
పూణె మెట్రో అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదనపు ఆదాయాన్ని రాబట్టుకొనేందుకు కొన్ని చర్యలు చేపట్టారు. పూణె మెట్రోలో టికెట్లేకుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని అధికారుల దృష్టికి సమాచారం వెళ్లిందని తెలుస్తోంది. దీంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి పూణె మెట్రో రూ. 85 లు ఫైన్ విధించింది. ఈ విషయాన్ని పూణె మెట్రో సంస్థ తన అధికారిక ట్విట్టర్ X ద్వారా తెలిపింది.
पुणे मेट्रोने प्रवास करतांना प्राथमिक सूचनांचे पालन करा, प्रवासाचा आनंद घ्या !
— Pune Metro Rail (@metrorailpune) November 28, 2023
Embrace the journey on Pune Metro by following the basic instructions for a delightful experience!#PuneMetroEtiquette #TicketRules #TimeLimit #TravelResponsibly #MetroJourneyRules #TicketValidity… pic.twitter.com/y8ub35zCH8
అంతే కాకుండా కొంతమంది యూత్ మెట్రో స్టేషన్లలో సెల్ఫీలు దిగుతూ.. నానా రచ్చ చేస్తున్నారు. టికెట్ కొన్న కొన్ని గంటల తరువాత వారు తమ గమ్య స్థానానికి ప్రయాణిస్తున్నారు. అప్పటి వరకు మెట్రో స్టేషన్లలోనే ఉండి కాలయాపన చేయడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన అధికారులు అలాంటి వారికి చెక్ పెట్టేందుకు పూణె మెట్రో మరో నిర్ణయం తీసుకుంది. టికెట్ కొనుగోలు చేసిన 20 నిమిషాలలోపుగానే వారు ప్రయాణం చేయాలని సమయం దాటి మెట్రో స్టేషనులో ఉంటే ఫైన్ విధిస్తామని ప్రకటించింది. ఈ కాల పరిమితిని గంట మించితే రూ. 10 లు... గరిష్ఠంగా రూ. 50 లు విధిస్తామని పూణె మెట్రో సంస్థ ప్రకటించింది.