వంతెన సమీపంలో పడవ బోల్తా

వంతెన సమీపంలో పడవ బోల్తా

జార్ఖండ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. బార్పెండియా వంతెన సమీపంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఐదుగురిని రక్షించారు. మరో 12 మంది తప్పిపోయారు. బోటులో 18 మంది వ్యక్తులు ధన్‌బాద్‌లోని నిర్సా నుంచి జమ్తారాకు వెళ్తున్నారు. ఐదుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఎన్‌డిఆర్‌ఎఫ్‌ చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు జమ్తారా జిల్లా పరిపాలన అధికారులు తెలిపారు. NDRF ఆధ్వర్యంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఈ దుర్ఘటన గురువారం రోజు చోటు చేసుకుంది.