హుజురాబాద్ మున్సిపల్ ఛైర్మన్ ఇంటి అడ్రస్ పై34 ఓట్లు

హుజురాబాద్ మున్సిపల్ ఛైర్మన్  ఇంటి అడ్రస్ పై34 ఓట్లు

హుజురాబాద్ లో ఆర్డీఓ నేతృత్వంలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయన్నారు  బీజేపీ నేత ఈటల రాజేందర్ . పెద్ద పెద్ద ఊర్లలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారన్నారు. ఓట్లు వేయరనుకున్న వాళ్ల ఓట్లు తీసేస్తున్నారన్నారు. ఒక్కొక్క ఇంట్లో 30,40, ఓట్లు నమోదు చేయిస్తున్నారన్నారు. హుజురాబాద్ మున్సిపల్ ఛైర్మన్ రాధిక ఇంట్లో 34 ఓట్లు ఉన్నాయంటూ ఆధారాలు చూపెట్టారు ఈటల. ఓట్లు తొలగించకుండా కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలన్నారు.దొంగ ఓట్లపై కార్యకర్తలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. సర్కార్ అధికార దుర్వినియోగం ఎక్కువైందన్నారు